సింగరేణి కార్మికుడికి కరోనా..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. మణుగూరు ఏరియా సింగరేణిలో ఫిట్టర్ గా పనిచేస్తోన్న కార్మికునికి కరోనా పాజిటివ్,
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి క్రమక్రమంగా అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. దేశాల నుండి రాష్ట్రాలు, జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రశాంతంగా వుండే పల్లెలకు సైతం కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడంతో భయం గుప్పిట్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. మణుగూరు ఏరియా సింగరేణిలో ఫిట్టర్ గా పనిచేస్తోన్న కార్మికునికి కరోనా పాజిటివ్ రావడంతో తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 16న సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఈనెల 18న హైదరాబాద్ వెళ్లగా…అక్కడి వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో అతడికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అతడిని క్వారంటైన్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు.