
Manchu laxmi funny reply to rakul post: కరోనా అన్లాక్ తర్వాత తిరిగి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. దయచేసి నన్ను కలిసినవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’ రకుల్ ట్వీట్ చేశారు.
I tested and im negative. Most negative person of the year is me ?
— Lakshmi Manchu (@LakshmiManchu) December 22, 2020
అయితే తాజాగా ఈ ట్వీట్పై స్పందించిన నటి, నిర్మాత లక్ష్మీ మంచు కాస్త ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. రకుల్ సూచించినట్లుగానే కరోనా పరీక్ష చేయించుకున్న లక్ష్మీ కామెంట్ చేస్తూ.. ‘నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. ఈ ఏడాదికి మోస్ట్ నెగిటివ్ పర్సన్ నేనే’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఇలా రకుల్ చెప్పిన సీరియస్ విషయాన్ని కూడా లక్ష్మీ ఫన్నీగా మార్చేసిందన్నమాట. ఇదిలా ఉంటే రకుల్, లక్ష్మీ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.