YS Jagan: ఆన్లైన్ కాల్మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
ఆన్లైన్ కాల్మనీ వ్యవహారాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని...
YS Jagan Comments: ఆన్లైన్ కాల్మనీ వ్యవహారాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాల్మనీ వేధింపులపై టీవీ9లో వస్తున్న వరుస కథనాలపై సీఎం జగన్ స్పందించారు. కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. యాప్ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలిచ్చి వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లోన్ యాప్లపై స్పెషల్ డ్రైవ్లు చేపదుతున్నామని.. మైక్రో ఫైనాన్స్పై కూడా ప్రత్యెక దృష్టి సారించమని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ మొబైల్ లోన్ యాప్లు ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తున్నాయని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read:
‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!
ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 402 పాజిటివ్ కేసులు నమోదు..