Maoist attack: విశాఖ ఏజెన్సీలో రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య.. ఆపై లేఖ విడుదల..

|

Dec 14, 2020 | 11:30 AM

మావోయిస్టులు రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆపై లేఖను విడిచి..

Maoist attack: విశాఖ ఏజెన్సీలో రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య.. ఆపై లేఖ విడుదల..
Maoist Attacks
Follow us on

Maoist attack: మావోయిస్టులు రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆపై లేఖను విడిచి వెళ్లారు. వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ నెపంతో వాకపల్లికి చెందిన గెమ్మెలి కృష్ణారావు అనే వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత అతని మృతదేహం వద్ద లేఖను వదిలి వెళ్లారు. సమాచార బట్వడాకు సంబంధించి పలుమార్లు హెచ్చరించినా కృష్ణారావు తన పద్దతిని మార్చుకోలేదని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు. పోలీసులకు, అధికారులకు ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తుండటంతోనే అతన్ని హత్య చేశామని మావోలు అంగీకరించారు. అయితే ఈ లేఖ కోరికొండ పెదబయలు ఏరియా కమిటీ మావోయిస్టుల పేరిట ఉంది. కృష్ణారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇన్ఫార్మర్ నెపంతోనే కృష్ణారావును మావోయిస్టులు హత్య చేసినట్లు ధృవీకరించారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read:

Danger Bells: చక్కెరను అతిగా వాడుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.. శరీరంలోకి వెళ్లిన చక్కెర కేన్సర్ కణాలకు అలా ఉపయోగపడుతుందట..

TIGER FEAR IN TELANGANA: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆవుపై దాడి.. భయాందోళనలో ప్రజలు..