AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు మహారాష్ట్ర తిరస్కరణ

సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు అనుమతిని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇది బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర వ్యవహారంగా మారింది. ఇక ఏ దర్యాప్తు అయినా చేయాలంటే సీబీఐ....

సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు మహారాష్ట్ర తిరస్కరణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 22, 2020 | 11:14 AM

Share

సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు అనుమతిని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇది బీజేపీ వర్సెస్ మహారాష్ట్ర వ్యవహారంగా మారింది. ఇక ఏ దర్యాప్తు అయినా చేయాలంటే సీబీఐ…. ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. పఏపీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్ తరువాత తాజాగా రాజస్థాన్ రాష్ట్రం కూడా ఈ దర్యాప్తు సంస్థకు ‘కవాటాలు మూసేసింది” యూపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ ఫిర్యాదును పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ కి సంబంధించిన రేటింగ్స్ స్కామ్ పై ఇన్వెస్టిగేషన్ కి సీబీఐ  నడుం బిగించిన నేపథ్యంలో  మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు ఛానల్స్ వ్యవహారంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును బీజేపీ కోరగా, దాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తమ ముంబై పోలీసుల దర్యాప్తు పట్లే మొగ్గు చూపిన విషయం గమనార్హం.

Follow Us