AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయలలిత ఆస్తులు వాళ్ల‌కే చెందుతాయ్… స్ప‌ష్టం చేసిన కోర్టు..

తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత వారసులుగా ఆమె మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీపను మద్రాస్ హైకోర్టు అనౌన్స్ చేసింది. దీంతో ఆమె ఆస్తులకు వారు అఫిషియ‌ల్ గా వారుసులు అయ్యారు. చెన్నైలో ఉన్న జయలలిత ఇంటిలో కొంత భాగాన్ని ఆమె స్మారకంగానూ, మరికొంత భాగాన్ని సీఎం కార్యాలయంగానూ(వేద నిలయం) మార్చాల‌ని హైకోర్టు పేర్కొంది. తమ సూచనలపై ఆన్స‌ర్ ఇవ్వాల్సిందిగా తమిళనాడు స‌ర్కార్ కు మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎన్.కిరుబకరణ్, […]

జయలలిత ఆస్తులు వాళ్ల‌కే చెందుతాయ్... స్ప‌ష్టం చేసిన కోర్టు..
Ram Naramaneni
|

Updated on: May 27, 2020 | 9:25 PM

Share

తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత వారసులుగా ఆమె మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీపను మద్రాస్ హైకోర్టు అనౌన్స్ చేసింది. దీంతో ఆమె ఆస్తులకు వారు అఫిషియ‌ల్ గా వారుసులు అయ్యారు. చెన్నైలో ఉన్న జయలలిత ఇంటిలో కొంత భాగాన్ని ఆమె స్మారకంగానూ, మరికొంత భాగాన్ని సీఎం కార్యాలయంగానూ(వేద నిలయం) మార్చాల‌ని హైకోర్టు పేర్కొంది. తమ సూచనలపై ఆన్స‌ర్ ఇవ్వాల్సిందిగా తమిళనాడు స‌ర్కార్ కు మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎన్.కిరుబకరణ్, జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

జయలలిత ఆస్తుల పరిరక్షణకు ఓ స్పెష‌ల్ టీమ్ ను ఏర్పాటు చేయవలసిందిగా ఓ లాయ‌ర్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు జయలలితకు తమను వారసులుగా గుర్తించాల‌ని..ఆమె మేన‌కోడ‌లు, మేన‌ల్లుడు దీప, దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. కోర్టు తీర్పుపై దీప సంతోషం వ్యక్తం చేశారు. జయలలిత నివాసాన్ని గ‌వర్న‌మెంట్ ఆధీనంలోకి తీసుకోవడానికి స‌ర్కార్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత కోర్టు ఈ కామెంట్స్ చేసింది. జయలలిత నివాసాన్ని మెమోరియల్‌గా మారుస్తామని గ‌వ‌ర్న‌మెంట్ ఆ ఆర్డినెన్స్‌లో వెల్ల‌డించింది.