AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెలకు అంటని కరోనా…

కరోనా వైరస్…భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇతరదేశాలకు వ్యాప్తి చెంది మరణమ్రుదంగం మోగిస్తోంది. మార్చి నుండి భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. కట్టుదిట్టమైన కట్టడితో కోవిడ్ -19 ఇప్పటికే ఇండియాలో మొత్తం 736 జిల్లాలకుగానూ… 411జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. సుమారు 325 జిల్లాలో అస్సలు కరోనా కేసులే నమోదు కాలేదు. అంటే […]

పల్లెలకు అంటని కరోనా...
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2020 | 10:44 PM

Share

కరోనా వైరస్…భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇతరదేశాలకు వ్యాప్తి చెంది మరణమ్రుదంగం మోగిస్తోంది. మార్చి నుండి భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. కట్టుదిట్టమైన కట్టడితో కోవిడ్ -19 ఇప్పటికే ఇండియాలో మొత్తం 736 జిల్లాలకుగానూ… 411జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. సుమారు 325 జిల్లాలో అస్సలు కరోనా కేసులే నమోదు కాలేదు. అంటే దాదాపు ఇండియాలో సగభాగం ఇంకా కోవిడ్ కేసులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. మరోవైపు భారత్ లో మొత్తం కరోనా వైరస్ కేసులలో దాదాపు 46 శాతం అంటే కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఈ జిల్లాలో సుమారు వందకుపైగా కోవిడ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం గుర్తించింది. మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను కంటైన్ మెంట్ క్లస్టర్ల్ గా విభజించి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠినచర్యలు చేపట్టింది. అంతేకాదు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి వైరస్ వ్యాపించకుండా కఠినచర్యలు అమలు చేస్తోంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారత్ లో కరోనా వైరస్ కొన్ని నగరాల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలోని ముంబై, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, తెలంగాణలోని హైదరాబాద్, ఛత్తీస్ గఢ్ లోని కోర్బా, జార్ఖండ్ లోని రాంచి, ఒడిశాలోని కుర్ధాలో మహమ్మారి విజ్రుంభిస్తోంది. భారత్ లో నమోదైన కరోనా కేసులలో 50 శాతానికి పైగా ఈ నగరాల్లోనే ఉన్నాయి. అంతేకాదు ఢిల్లీ , తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో నమోదైన కేసుల్లో నాలుగోవంతు లేదా అంతకంకంటే ఎక్కువ అత్యధికంగా ప్రభావితమైనవిగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!