AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో కాస్త ఊరటను ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ జరిగిన సమయం నాటి మార్కెట్‌ విలువపైనే...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..
Ravi Kiran
|

Updated on: Sep 17, 2020 | 2:53 PM

Share

ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో కాస్త ఊరటను ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ జరిగిన సమయం నాటి మార్కెట్‌ విలువపైనే ఫీజును వసూలు చేస్తామని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా… జీవోలో మాత్రం ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారమే ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే బేసిక్‌ ఛార్జీలను మాత్రం తగ్గించింది. (Layouts Regulation Scheme Rates Reduced)

జీవో 131ను మార్పు చేస్తూ కొత్తగా జీవో 135ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం గజం 3 వేల వరకు మార్కెట్‌ రేటు ఉంటే… 20 శాతం ఫీజు కట్టాల్సి ఉంటుంది. గతంలో ఇది 25 శాతం ఉండేది. అలాగే గజం 5 వేల వరకు ఉంటే 30 శాతం(గతంలో 50 శాతం) కట్టాలి. అలాగే గజం 10 వేల వరకు ఉంటే 40 శాతం(గతంలో 75 శాతం) ఫీజు కట్టాల్సి ఉంటుంది.

అటు గజం 20 వేల వరకు 50 శాతం, గజం 30 వేల వరకు ఉంటే 60 శాతం ఫీజును చెల్లించాల్సి ఉండగా… గజం 50 వేల వరకు ఉంటే 80 శాతం, ఆపైన ఉంటే 100 శాతం ఫీజును కట్టాలని కొత్త జీవో పేర్కొంటోంది. కాగా, గతంలో గజం పది వేలు దాటితే… వంద శాతం ఫీజు కట్టాల్సి ఉండేది. అంతేకాదు గతంలో నాలుగు శ్లాబ్‌లు ఉంటే… ఈసారి వాటిని ఏడుకు పెంచింది ప్రభుత్వం.

Also Read:

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!