AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాక్టీస్ ప్రారంభించిన పంజాబ్, రాజస్థాన్ జట్లు

అందరికంటే ముందే చేరుకున్నారు.. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ కేంద్రంగా మొదలు కాబోతున్న ఐపీఎల్ వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి...

ప్రాక్టీస్ ప్రారంభించిన పంజాబ్, రాజస్థాన్ జట్లు
Sanjay Kasula
|

Updated on: Aug 26, 2020 | 6:03 PM

Share

అందరికంటే ముందే చేరుకున్నారు.. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ కేంద్రంగా మొదలు కాబోతున్న ఐపీఎల్ వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. అయితే అక్కడి కొవిడ్ ఆంక్షల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే అందరికన్నా ముందుగా దుబాయ్‌కు చేరుకున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల ఆరు రోజుల క్వారంటైన్‌ ముగించుకున్నాయి. ఆటగాళ్లకు నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని తేలింది. దీంతో బుధవారం సాయంత్రం ఈ రెండు జట్లు అధికారికంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. యూఏఈలో ఉదయం ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి సాయంత్రమే అన్ని జట్లు ప్రాక్టీస్  చేసేందుకు ఇష్ట పడుతున్నాయి.

గత గురువారం పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ దుబాయ్‌ చేరుకున్నాయి. బస సైతం అక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. అదేరోజు సాయంత్రం చేరుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అబుదాబిలోని ఓ స్టార్ హోటల్‌లో దిగింది. బీసీసీఐ నిబంధన ప్రకారం అక్కడికి చేరుకున్నాక 1, 3, 6 రోజుల్లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేశారు. క్వారంటైన్‌లో ఆటగాళ్లను వారి గదుల నుంచి బయటకు అడుగు పెట్టనీయలేదు.

ఐసీసీ మైదానాల్లో రాజస్థాన్ రాయల్స్‌ సాధన చేయనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ గత శుక్రవారం అక్కడికి చేరుకున్నాయి. వారి క్వారంటైన్‌ గురువారంతో ముగుస్తుంది. అన్ని జట్ల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత అసలు సిసలైన సందడి మొదలవ్వనుంది.