AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాద్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

ఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యల్ని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించగా.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విటర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశభక్తుడిగానే ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయంగా […]

సాద్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
Ram Naramaneni
|

Updated on: May 16, 2019 | 6:38 PM

Share

ఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యల్ని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించగా.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విటర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశభక్తుడిగానే ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలైనా ఉండొచ్చు గానీ.. ప్రతిదానికీ హద్దులు ఉంటాయన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యావత్‌ జాతికి ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.