AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వరం మార్చిన కోమటిరెడ్డి

ఎప్పుడూ అధికార పార్టీపై కస్సుబుస్సుమనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా స్వరం మార్చారు. మంత్రి కేటీఆర్‌పై ఒక్కసారిగా ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. ఇండస్ట్రీయల్ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. భూసేకరణ విషయంలో తోడ్పాడునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. […]

స్వరం మార్చిన కోమటిరెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 01, 2019 | 6:29 PM

Share

ఎప్పుడూ అధికార పార్టీపై కస్సుబుస్సుమనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా స్వరం మార్చారు. మంత్రి కేటీఆర్‌పై ఒక్కసారిగా ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. ఇండస్ట్రీయల్ పార్కు కోసం రైతులు తక్కువ ధరకు భూములిచ్చి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. భూసేకరణ విషయంలో తోడ్పాడునందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారన్నారు కొమటిరెడ్డి. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిందే ఈ కార్యక్రమమని అన్నారు. కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.