KKR vs KXIP : రాణించిన గిల్‌, మోర్గాన్‌..పంజాబ్ టార్గెట్ 150

|

Oct 26, 2020 | 9:50 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. దీంతో  నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంది. 

KKR vs KXIP : రాణించిన గిల్‌, మోర్గాన్‌..పంజాబ్ టార్గెట్ 150
Follow us on

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 149/9కే పరిమితమైంది.  మహ్మద్‌ షమి (3/35), రవి బిష్ణోయ్‌ (2/20), క్రిస్‌ జోర్డాన్‌ (2/25),  మురుగన్‌ అశ్విన్‌ (1/27),   సమష్టిగా రాణించి మోర్గాన్ సేనను ముప్పుతిప్పులు పెట్టారు. మ్యాక్స్‌వెల్ కూడా ఒక వికెట్ తీశాడు.  అయితే కోల్‌కతా జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (57; 45 బంతుల్లో 3×4, 4×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇయాన్‌ మోర్గాన్‌ (40; 25 బంతుల్లో 5×4, 2×6) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. లాకీ ఫెర్గూసన్‌ (24*; 13 బంతుల్లో 3×4, 1×6) ఆఖర్లో బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో కోల్‌కతా ఓ మోస్తారు స్కోరు చేయగలిగింది.

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును

ఏపీ : వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల