సీపీఎం యువనేతను పెళ్లాడనున్న కేరళ సీఎం కూతురు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్ను వివాహం చేసుకోబోతున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్ను వివాహం చేసుకోబోతున్నారు. ఇంతకు ముందే వీరువురు వైవాహిక జీవితాలు విడాకులతో ముగియడంతో ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కానుంది. వృత్తి రీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న రియాజ్.. 2009 లోక్సభ ఎన్నికల్లో కొజికోడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వీణ బెంగళూరులో సొంత సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వీణకు ఒక్కరు, రియాజ్కు ఇద్దరు చొప్పున ఇంతకు ముందే పిల్లలు ఉన్నారు. జూన్ 15న ఇరిద్దరు ఒకటి కాబోతున్నారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా సన్నిహిత బంధువుల సమక్షంలో ఈ వివాహం నిరాడంబరంగా జరగనుంది. రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ పి. ఎం. అబ్దుల్ ఖాదర్ కుమారుడు మహ్మద్ రియాజ్ ఫిబ్రవరి 2017 లో డివైఎఫ్ఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మార్క్సిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న రియాజ్ జాతీయ స్థాయి యువ నాయకుడిగా ఎదిగారు.