కంగనా, రంగోలీలకు మరోసారి సమన్లు

|

Nov 03, 2020 | 4:11 PM

బాలీవుడ్​ వివాదాస్పద నటి​ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి​కి ముంబయిలోని బాంద్రా పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు.

కంగనా, రంగోలీలకు మరోసారి సమన్లు
Follow us on

బాలీవుడ్​ వివాదాస్పద నటి​ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి​కి ముంబయిలోని బాంద్రా పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. నవంబరు 9,10 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంతకుముందు అక్టోబర్ 26, 27న విచారణకు హాజరుకావాల్సిందిగా కంగనా సిస్టర్స్​కు సమన్లు పంపారు పోలీసులు. అయితే అప్పుడు వారిద్దరు గైర్హాజరయ్యారు. వారి సోదరుడి పెళ్లి సందర్భంగా విచారణకు రాలేకపోయారంటూ కంగన తరఫు లాయర్ జమీందర్​ పోలీసులకు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వారికి మరోసారి సమన్లు పంపారు ముంబయి పోలీసులు.

 కంగనా సిస్టర్స్  బాలీవుడ్ పేరును దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ​ ఫిట్​నెస్​ ట్రైనర్​ సయ్యద్ కేసు పెట్టారు. మతపరమైన గొడవలు సృష్టించేలా సోషల్​మీడియా వేదికగా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నెపోటిజమ్​, డ్రగ్స్​ గురించి కూడా వారి వ్యాఖ్యలు అభ్యంతరకరమని పేర్కొన్నారు.  కంగనా సిస్టర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబయి పోలీసులు కంగనా సిస్టర్స్​పై కేసు నమోదు చేసి వారిని విచారణకు రావాలని నోటీసులు పంపారు.

Also Read :

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !