నేడు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు. జైపాల్రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్కు పార్థివదేహాన్నితరలించి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు […]
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు. జైపాల్రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్కు పార్థివదేహాన్నితరలించి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.