జగన్‌పై హత్యాయత్నం కేసు వాయిదా

| Edited By: Pardhasaradhi Peri

Apr 03, 2019 | 6:22 PM

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును బుధవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కాసేపటి విచారణ అనంతరం కేసును ఈ నెల 16కు వాయిదా వేశారు. కాగా ఓ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు వస్తోన్న జగన్‌పై గతేడాది వైజాగ్ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. విమానాశ్రయం రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో జగన్‌పై […]

జగన్‌పై హత్యాయత్నం కేసు వాయిదా
Follow us on

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును బుధవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కాసేపటి విచారణ అనంతరం కేసును ఈ నెల 16కు వాయిదా వేశారు.

కాగా ఓ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు వస్తోన్న జగన్‌పై గతేడాది వైజాగ్ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. విమానాశ్రయం రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో జగన్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్‌ భుజానికి స్వల్ప గాయమైంది. ఈ కేసును మొదట పోలీసులు చేపట్టినా.. తరువాత ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.