AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురు ప్రత్యేకత ఏంటి? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఇదే!

Jagannath Rath Yatra 2026: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో గజపతి మహారాజు బంగారు చీపురుతో రథయాత్ర మార్గాన్ని ఎందుకు ఊడుస్తారు? 'చెరా పహరా'గా పిలిచే ఈ విశిష్ట సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం, సేవాభావం, సమానత్వానికి ప్రతీక అయిన విశేషాలను తెలుసుకోండి.

జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురు ప్రత్యేకత ఏంటి? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఇదే!
Jagannath Rath Yatra 2026
Rajashekher G
|

Updated on: Jul 15, 2026 | 10:26 PM

Share

ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే ‘జగన్నాథ రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ ఏడాది జూలై 16న రథయాత్ర వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రా దేవితో కలిసి మహా రథాలపై ఆలయం నుంచి బయలుదేరి గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ దివ్య యాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, రథాల తాళ్లు లాగి స్వామివారికి సేవ చేసే భాగ్యం పొందేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు. రథయాత్రలో అనేక విశిష్ట సంప్రదాయాలు పాటిస్తారు. వాటిలో అత్యంత ఆకర్షణీయమైనది ‘బంగారు చీపురుతో రథయాత్ర మార్గాన్ని శుభ్రపరచే ఆచారం’. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఎంతో గొప్పది.

బంగారు చీపురుతో మార్గాన్ని ఎవరు ఊడుస్తారు?

రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ గజపతి మహారాజు లేదా ఆయన వారసులు ‘చెరా పహరా’ (Chhera Pahanra) అనే పవిత్ర సేవను నిర్వహిస్తారు. బంగారు పిడితో అలంకరించిన ప్రత్యేక చీపురుతో రథాల చుట్టూ, రథయాత్ర మార్గాన్ని ఊడ్చి పవిత్ర జలాలను చల్లుతారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య రథయాత్ర ఘనంగా ప్రారంభమవుతుంది.

ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన

సనాతన ధర్మంలో బంగారం పవిత్రత, దైవత్వం, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే జగన్నాథుని రథం ప్రయాణించే మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రపరచడం ద్వారా స్వామివారికి అత్యున్నత గౌరవం అర్పిస్తారు. అయితే ఈ ఆచారం కేవలం మార్గాన్ని శుభ్రం చేయడానికే కాదు. దేవుని ముందు అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది. రాజ్యాధికారం కలిగిన గజపతి మహారాజే స్వయంగా చీపురు పట్టి రథం ముందు సేవ చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో రాజు, పేద, సామాన్యుడు అనే తేడాలు ఉండవని చాటిచెబుతారు.

ఇవి కూడా చదవండి

సేవాభావానికి ప్రతీక

జగన్నాథ రథయాత్రలో బంగారు చీపురుతో మార్గాన్ని ఊడ్చే సంప్రదాయం వినయం, సేవాభావం, అంకితభావానికి ప్రతీకగా భావించబడుతుంది. అధికారం ఉన్నవారైనా దేవుని సేవలో భక్తుల్లాగే వినయంతో ఉండాలనే సందేశాన్ని ఈ ఆచారం అందిస్తుంది.

భక్తుల విశ్వాసం ప్రకారం, ఈ దివ్య సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా దర్శించడం, రథయాత్రలో పాల్గొనడం, రథపు తాళ్లను లాగడం వల్ల జగన్నాథ స్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట ఆచారం నేటికీ రథయాత్రలో అత్యంత పవిత్రమైన, భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలిచింది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us