వైఎస్సార్ జగనన్న కాలనీ మోడల్ హౌస్లు రెడీ
ఏపీ సర్కార్ పేదల కోసం 'వైఎస్సార్ జగనన్న కాలనీ'ల పేరుతో నిర్మించనున్న మోడల్ హౌస్లను అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెడీ చేశారు.

ఏపీ సర్కార్ పేదల కోసం ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పేరుతో నిర్మించనున్న మోడల్ హౌస్లను అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెడీ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ సంస్థ విడివిడిగా రెండు నమూనా గృహాలను నిర్మించాయి. సోమవారం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ రెండు రకాల మోడల్ హౌస్లను పరిశీలించారు. వీటిని ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
Also Read :
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !




