దుబాయ్ చేరుకున్న ఆ మూడు జట్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందడి మొదలైంది. చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ ఎట్టకేలకు మొదలు కాబోతోంది. రంగుల ఆటకు దుబాయ్ వేదికగా మారుతోంది. ఇందు కోసం ఇప్పటికే  ఎనిమిది ప్రాంఛైజీల్లోని మూడు జట్లు...

దుబాయ్ చేరుకున్న ఆ మూడు జట్లు
Follow us

|

Updated on: Aug 20, 2020 | 9:59 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందడి మొదలైంది. చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఐపీఎల్ ఎట్టకేలకు మొదలు కాబోతోంది. రంగుల ఆటకు దుబాయ్ వేదికగా మారుతోంది. ఇందు కోసం ఇప్పటికే  ఎనిమిది ప్రాంఛైజీల్లోని మూడు జట్లు అక్కడి చేరుకున్నాయి. ఇందులో రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గురువారం యూఏఈలో అడుగుపెట్టాయి.

ఐపీఎల్ 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభంకానుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నాక కొన్నిరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండటంతో ముందుగానే ఆయా ఫ్రాంఛైజీలు యూఏఈకి చేరుకుంటున్నాయి. చార్టర్‌ విమానాల్లో రాజస్థాన్‌, పంజాబ్‌ జట్లు దుబాయ్‌లో ల్యాండ్‌ అయ్యాయి.అయితే ఇందులో దుబాయ్ కు చేరుకున్నది మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టు. అంతా పీపీఈ సీట్లు, మాస్కులు ధరించి అక్కడికి చేరుకున్నారు. ఆటగాళ్లు వ్యక్తిగతమైన జాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయా జట్లు మేనేజర్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం కోల్‌కతా టీమ్‌ అబుధాబికి చేరుకున్నది. అయితే అంతా కరోనా ఆంక్షలను పాటిస్తున్నారు.