ఐపీఎల్ 2020: ధోనిసేన మరో షాక్.. టోర్నీ నుంచి బ్రావో ఔట్!

ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ ‌బ్రావో గాయం కారణంగా పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగాడు.

ఐపీఎల్ 2020: ధోనిసేన మరో షాక్.. టోర్నీ నుంచి బ్రావో ఔట్!
Follow us

|

Updated on: Oct 21, 2020 | 4:46 PM

IPL 2020: ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ డ్వేన్ ‌బ్రావో గాయం కారణంగా పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌ల్లో బ్రావో ఆడటం లేదని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 17వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావోకు గాయమైన సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. దాదాపుగా ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయింది. చెన్నై మునుపెన్నడూ ఇంతటి చెత్త ఫామ్‌ను కనబరచలేదు. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం.. టెస్ట్ మ్యాచ్ టైప్ బ్యాటింగ్.. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకోవడం.. అంతకంటే మించి జట్టు సారధి ధోని ఫామ్ కోల్పోవడం చెన్నై సూపర్ కింగ్స్ ఓటములకు ప్రధాన కారణాలు.