AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మంత్రి పై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు..!

కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వస్తున్న వేళ ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్‌ మహ్‌పుద్‌ ఎమ్‌డీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కరోనాను ఎదురు తిరిగిన భార్యగా పోల్చటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మనం ఎన్నిరోజులని ఇలా గిరిగీసుకుని కూర్చుంటాం. మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా తనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ ను నలుగురితో షేర్ చేసుకున్నారు. ‘కరోనా వైరస్‌ మీ భార్య లాంటిది. మొదట్లో […]

ఆ మంత్రి పై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు..!
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 5:40 PM

Share

కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వస్తున్న వేళ ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్‌ మహ్‌పుద్‌ ఎమ్‌డీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కరోనాను ఎదురు తిరిగిన భార్యగా పోల్చటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మనం ఎన్నిరోజులని ఇలా గిరిగీసుకుని కూర్చుంటాం. మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా తనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ ను నలుగురితో షేర్ చేసుకున్నారు. ‘కరోనా వైరస్‌ మీ భార్య లాంటిది. మొదట్లో దాన్ని కంట్రోల్‌ చేద్దామని భావించారు కానీ, అది జరగని పని.. ఇక సర్దుకునిపోవటమే మేలని అనుకుంటున్నారు అని వివరించారు మంత్రి మహ్మద్‌. దీంతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. బాధ్యత కలిగిన వ్యక్తి భార్యలను కరోనాతో పోల్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితులు రాజకీయ నాయకుల చేతగాని తనానికి, మహిళల్ని కించపరిచే తత్వానికి నిదర్శనమని మహిళా సంఘ నాయకురాలు దిండ నిశ యూరా మండిపడ్డారు.