AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా.. భారత్!

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఏడు శాతం వృద్ధితో 158 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది. చైనా బ్రాండ్ల వాటా […]

రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా.. భారత్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 25, 2020 | 10:17 PM

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. 2019లో ఏడు శాతం వృద్ధితో 158 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది. 2019లో షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, శామ్‌సంగ్ 21 శాతంతో రెండో స్థానంలో, వివో 16 శాతం మార్కెట్ వాటాతో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ‘మార్కెట్ మానిటర్’ తాజా నివేదికలో పేర్కొంది.

చైనా బ్రాండ్ల వాటా 2019 సంవత్సరానికి 72 శాతానికి చేరుకుంది, ఇది గత ఏడాది 60 శాతం ఉంది. “ఈ సంవత్సరం, అన్ని ప్రధాన చైనా మోడళ్ళు షియోమి, రియల్‌మీ, వన్‌ప్లస్ తమ ఆఫ్‌లైన్ అమ్మకాల పాయింట్లను పెంచగా, వివో వంటి బ్రాండ్లు తమ ఆన్‌లైన్ పరిధిని విస్తరించాయి. గత నాలుగు సంవత్సరాల్లో షియోమి, వివో, వన్‌ప్లస్ అమ్మకాలు వరుసగా 15 రెట్లు, 24 రెట్లు, 18 రెట్లు పెరిగాయి. శామ్‌సంగ్ ఎగుమతులు 2019 లో దాదాపు ఐదు శాతం క్షీణించాయి.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేయగా, ఫీచర్ ఫోన్ మార్కెట్ 2019లో దాదాపు 42 శాతం క్షీణించింది. కాగా.. 2019 ఆఖరి త్రైమాసికంలో ఐటెల్ నంబర్ వన్ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది, తరువాత శామ్‌సంగ్ మరియు లావా ఉన్నాయి.