భారత్ లో కరోనా కల్లోలం..24 గంటల్లో 32,695 కేసులు, 606 మంది మృతి
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 606 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు విడిచారు.
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 606 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు విడిచారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876కి చేరుకుంది. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 6,12,815 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 24,915.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,75,640కి చేరింది. 10,928 మంది వైరస్ కారణంగా చనిపోయారు. తమిళనాడులో కేసులు 1,51,820 మందికి కరోనా సోకింది. 2,167 మంది వైరస్ కు బలయ్యారు. ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 1,16,993గా ఉంది. మొత్తంగా 3,487 మంది చనిపోయారు. గుజరాత్లో మొత్తంగా 44,552 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 2,079మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.