బ్రిటన్ ప్రధాని బోరిస్కి మోదీ ఫోన్..ఏం మాట్లాడారంటే?
బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్ జాన్సన్కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్ శుభాకాంక్షలు చెప్పారు. చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్తో ప్రస్తావించారు మోదీ. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని […]
బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్ జాన్సన్కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్ శుభాకాంక్షలు చెప్పారు.
చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్తో ప్రస్తావించారు మోదీ. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. భారత హైకమిషన్, అందులోని అధికారులు, పర్యటాకులకు పూర్తి భద్రత కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.