AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త ప్రకటించారు. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రోస్టేషన్లలో అద్దెకార్లు అందుబాటులోకి తెచ్చారు. సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిలో అద్దె ప్రాతిపాదికన నడిచే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. అయితే అతి చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. కేవలం గంటకు రూ.40 మాత్రమే చార్జి చేస్తున్నారు. మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు. అయితే […]

మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు
Anil kumar poka
|

Updated on: Jun 08, 2019 | 11:38 AM

Share

నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త ప్రకటించారు. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా మెట్రోస్టేషన్లలో అద్దెకార్లు అందుబాటులోకి తెచ్చారు. సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిలో అద్దె ప్రాతిపాదికన నడిచే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లను మియాపూర్ స్టేషన్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. అయితే అతి చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చారు. కేవలం గంటకు రూ.40 మాత్రమే చార్జి చేస్తున్నారు. మొట్టమొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలు అధికారులు దశల వారీగా ఇతర స్టేషన్లకు విస్తరించనున్నారు.

అయితే వీటిని మియాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్లో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి వీటిని ఉపయోగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికోసం జూమ్‌కార్‌తో మెట్రోసంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన వాహనాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణికుడు ముందుగా జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌లోడ్ చేయాలి. అనంతరం కార్‌లాక్ అన్‌లాక్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.

యాప్‌లో ఎన్నిగంటలు వాడుకుంటారో ఆప్షన్ సెలక్ట్‌ చేసుకొని అందుకు తగినంత మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. పూర్తిస్థాయి జీపీఎస్ సిస్టం కలిగి ఉన్న ఈ కార్లు తాము గమ్యస్థానానికి చేరి పార్కింగ్ చేయగానే లాక్ చేయబడుతుంది. అక్కడి నుండి స్టేషన్‌కు రావాలనుకున్న వ్యక్తులు మళ్లీ దానిని ఉపయోగించుకొనే విధంగా అధికారులు వీలు కల్పించారు. ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేవారితో పాటు ఐటీ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి అన్‌మ్యాన్‌డ్‌గా ఆపరేట్ చేసుకొనే వీలుండటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గుతుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ