AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ పెట్టుకోమంటే.. కత్తితో దాడి..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు బస్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 47 ఏళ్ల వయసు గల నిందితుడు

మాస్క్ పెట్టుకోమంటే.. కత్తితో దాడి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 8:10 PM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు బస్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 47 ఏళ్ల వయసు గల నిందితుడు మాస్క్ లేకుండా బస్‌లో ప్రయాణించాడని పోలీసులు చెప్పారు. ఇదే సమయంలో మాస్క్ ధరించాలని బస్ డ్రైవర్ చెప్పగా.. నిందితుడు తన జేబులో నుంచి కత్తి బయటకు తీశాడని పేర్కొన్నారు.

బస్సులోని తోటి ప్రయాణికులు సమాచారం ఇవ్వగా.. తాము అక్కడకు చేరుకున్నామన్నారు. మాస్క్ ధరించకపోగా.. ఆయుధాలు కలిగి ఉండటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే సమయంలో ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలని హాంకాంగ్ ప్రభుత్వం బుధవారం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..