AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిరిండియా విమానాలు రావద్దన్న హాంగ్ కాంగ్..!

ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ నిషేధం విధించింది. భారతదేశం నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హాంగ్ కాంగ్ ప్రభుత్వం వెల్లడించింది.

ఎయిరిండియా విమానాలు రావద్దన్న హాంగ్ కాంగ్..!
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 6:35 PM

Share

ఎయిర్ ఇండియా విమానాలను తాజాగా హాంగ్ కాంగ్ నిషేధం విధించింది. భారతదేశం నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హాంగ్ కాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో విమానాల రాకపోకలపై అంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 3 వరకు ఎయిరిండియాతో పాటు కాథే డ్రాగన్ విమానాలపై కూడా నిషేధం విధిస్తున్నట్లు హాంగ్ కాంగ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 18న భారత్‌కు చెందిన ఐదుగురు ప్రయాణికులు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంగ్ కాంగ్ చేరుకున్నారు. ఈ ఐదుగురికి కొవిడ్ టెస్టు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఈ ట్రిప్‌కు ముందు వీరు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని హాంగ్ కాంగ్ ప్రకటించింది.

ఇక ఇటీవల హాంగ్ కాంగ్‌లో ఒకేరోజు 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. వీరిలో మూడో వంతు మంది బాధితులు భారత్‌ నుంచి ప్రయాణించిన వారు ఉన్నట్లు గుర్తించారు. అందుకే అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాలపై బ్యాన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులో కూడా వందే భారత్ మిషన్‌లో భాగంగా నడిపిస్తున్న ఎయిరిండియా విమానాలపై హాంగ్ కాంగ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.