AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ సిద్ధం చేయండి: సీఎం ఆదేశం

Lockdown Exit Plan: ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్‌డౌన్ లో ఉండిపోయాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మే 17 తర్వాత కర్ణాటకలో రెస్టారెంట్లు, సెలూన్లు, వ్యాయామకేంద్రాలు తెరుచుకుంటాయని కర్ణాటక మంత్రి సీటీ రవి బుధవారం తెలిపారు. అంతేకాదు, రెడ్‌జోన్లలో కూడా ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని […]

లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ సిద్ధం చేయండి: సీఎం ఆదేశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 4:45 PM

Share

Lockdown Exit Plan: ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్‌డౌన్ లో ఉండిపోయాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మే 17 తర్వాత కర్ణాటకలో రెస్టారెంట్లు, సెలూన్లు, వ్యాయామకేంద్రాలు తెరుచుకుంటాయని కర్ణాటక మంత్రి సీటీ రవి బుధవారం తెలిపారు. అంతేకాదు, రెడ్‌జోన్లలో కూడా ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

కాగా.. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు పంపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, మిగిలిన చోట్ల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా వీలైనన్ని సడలింపులు ఇవ్వాలన్నది యడియూరప్ప సర్కార్ యోచనగా తెలుస్తోంది.

మరోవైపు.. మే 17 తర్వాత చాలావరకు బస్సులు, ఆటోలు, ట్యాక్సీలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు మెట్రో సర్వీస్‌ను అందుబాటులోకి తేవడానికి కూడా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!