జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ పాతబస్తీ మహావీర్ కాలేజీలో సంతోష్ నగర్ సర్కిల్ 7 లో
కౌంటింగ్ ప్రాంతాన్ని అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని, నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా బందోబస్తూ కొనసాగుతుందని… శాంతి భద్రతుల పట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని చౌహన్ తెలిపారు. 50 వేల 331 ఓట్లు పోలయ్యాయి.