AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ప్ర‌వేట్ ఆస్ప‌త్రుల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వార్నింగ్…

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుకు నమోదు చేసుకున్న అన్ని ప్రైవేటు హాస్పిట‌ల్స్ తప్పనిసరిగా లబ్దిదారులకు ట్రీట్మెంట్ అందించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. రూల్స్ అతిక్ర‌మించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఆ ప్ర‌వేట్ ఆస్ప‌త్రుల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వార్నింగ్...
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2020 | 8:40 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుకు నమోదు చేసుకున్న అన్ని ప్రైవేటు హాస్పిట‌ల్స్ తప్పనిసరిగా లబ్దిదారులకు ట్రీట్మెంట్ అందించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. రూల్స్ అతిక్ర‌మించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అలానే కోవిడ్-19 అనువైనవిగా గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో.. వైరస్ సోకిన‌వారితో పాటు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ చికిత్స అందించాల‌ని తెలిపింది.

అలాగే అన్ని రకాల వ్యాధుల‌కు నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలి. ఈ విష‌యాన్ని ఎవరైనా పెడ‌చెవిన పెడితే చర్యలు తప్పవని వెల్ల‌డించింది. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు… కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుకు నమోదు చేసుకున్నప్ప‌టికీ..అర్హులైన‌వారిక సేవ‌లు అందించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్న‌ట్లు మంత్రిత్వశాఖ దృష్టికి రావడంతో రివ్యూ మీటింగ్ నిర్వ‌హించింది.