హైదరాబాద్‌కు మరో మణిహారం…”స్కై వాక్” వచ్చేస్తోంది

హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకుంటోంది.

హైదరాబాద్‌కు మరో మణిహారం...స్కై వాక్ వచ్చేస్తోంది

Updated on: Nov 04, 2020 | 3:46 PM

Build Sky Walk : హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ను అద్భుతంగా త‌యారు చేసేందుకు ఇప్పటికే చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే దుర్గం చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దారు. అక్క‌డ నిర్మించిన  తీగల వంతెన న‌గరానికి మ‌ణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మ‌రో స్టీల్ వంతెన‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అయితే ఇప్పుడు ఎంతో రద్దీగా ఉండే మెహిదీపట్నం రోడ్డును ఎంపిక చేసింది.

మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్కై వాక్ నిర్మాణానికి  మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపిన‌ట్లు పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు.


త్వ‌ర‌లోనే ఈ నిర్మాణానికి టెండ‌ర్లను కూడా ఆహ్వానించ‌నున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్క‌డున్న బ‌స్ షెల్ట‌ర్స్ ను కూడా రీడిజైన్ చేయ‌నున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో నిర్మించ‌నున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌ల‌ను ఈ బ్రిడ్జికి అనుసంధానం చేయనున్నారు. ఈ 16 లిఫ్టుల్లోని రెండు లిఫ్ట్‌ల‌ను రైతు బ‌జార్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు.