తెల్లాతెల్లవారకముందే అదునుచూచి.. కాపుకాచి దాడి, కర్నూలు జిల్లాలో జాగింగ్ చేస్తున్న తండ్రీ కొడుకులపై ఎటాక్

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు..

తెల్లాతెల్లవారకముందే అదునుచూచి.. కాపుకాచి దాడి, కర్నూలు జిల్లాలో జాగింగ్ చేస్తున్న తండ్రీ కొడుకులపై ఎటాక్
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:07 AM

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో తెల్లవారుజామునే దారుణం జరిగింది. వాకింగ్ కి వెళ్లిన తండ్రి, కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. యువకుడు హర్షవర్ధన్ కు ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ కు ఎల్లుండి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దాడి జరగడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమా లేకుంటే, పాత కక్షల నేపథ్యంలో దాడికి పాల్పడ్డారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.