GHMC Mayor Bonthu Rammohan: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాల్లో రాళ్లు విసిరే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ టీవీ9తో మాట్లాడుతూ.. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకు అయోమయానికి గురి చేస్తున్నారని, టీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు పార్టీ గీత దాటరని స్పష్టం చేశారు. అయితే బల్దియాపై జెండా ఎగరేసేది టీఆర్ఎస్ పార్టీయేనని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.
చట్టాలపై అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఇప్పుడున్న పాలక మండలికి సమయం ఉందని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుందన్నారు.
కాగా, 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని, 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బొంతు రామ్మోహన్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
Telangana BJP: ఆ 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు.. మరోసారి బాంబ్ పేల్చిన బండి సంజయ్ కుమార్.