విజయవాడ గ్యాంగ్వార్ : మరో ముగ్గురి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఇరువర్గాలకు సంబంధించిన 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఇరువర్గాలకు సంబంధించిన 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణమైన పెనమూలురు అపార్ట్మెంట్లో సెటిల్ మెంట్ కు యత్నించిన శ్రీధర్, ప్రదీప్ కుమార్ రెడ్డి, నాగబాబులను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా.. ముగ్గురిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా ఈ ఘర్షణలో తోట సందీప్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.
కాగా శాంతిభ్రదతలకు విఘాతం కలిగించిన వీరిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగర బహిష్కర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ఇటువంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.