తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గద్దర్ వ్యాఖ్యలు

| Edited By:

Mar 28, 2019 | 10:04 PM

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రజత్ కుమార్ ను ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ‘‘అమరవీరులకు జోహార్. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వీరులకు నివాళులు. భారత దేశంలో రాజ్యాంగం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలి. సేవ్ కాంస్టిట్యూషన్ పేరుతో రెండేళ్లుగా ఉద్యమిస్తానున్నా. నేను అసెంబ్లీ ఎన్నికల్లో […]

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గద్దర్ వ్యాఖ్యలు
Follow us on

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రజత్ కుమార్ ను ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ ‘‘అమరవీరులకు జోహార్. ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన వీరులకు నివాళులు. భారత దేశంలో రాజ్యాంగం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలి. సేవ్ కాంస్టిట్యూషన్ పేరుతో రెండేళ్లుగా ఉద్యమిస్తానున్నా.

నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసాను. మళ్ళీ ఇప్పుడు జరగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తా. కేంద్రంలో సెక్యూలర్ పార్టీ అధికారంలోకి రావాలి. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పాడుతా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‍కు మద్దతుగా నిలిచాం. నా ఒంట్లో ఆరు బుల్లెట్లు ఉన్నాయి. ఇంకా నాపై లక్ష తూటాలు వచ్చినా పాడుతూనే ఉంటా. స్వచ్ఛందంగా నిజాయితీగా ప్రజలు ఓటు వేయండి. నవ యువతరం అంతా ఓటు అనే ఆయుధంతో దేశ భవిష్యత్తు మార్చాలి. కేసీఆర్ కొత్త ఆశయం ఫెడరల్ ఫ్రంట్ మంచి పనే. కానీ అందులో కవులు, కళాకారులు ఉండాలి. నాది రాజకీయం అంటున్నారు, అందర్నీ రమ్మంటున్నారు కానీ మమ్మల్ని పక్కన పెడుతున్నారు అని అన్నారు.