రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

|

Nov 03, 2020 | 2:33 PM

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
Follow us on

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పాణ్యం మండలం కౌలూరులో రైలు కిందపడి ఓ మహిళతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై నలుగురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జుగా మారాయని పోలీసులు తెలిపారు. అయితే, వీరంతా నంధ్యాల సమీపంలోని రాజకుంటకు చెందిన అబ్దుల్ కలాం కుటుంబానికి సంబంధించినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సామూహిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.