AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Linewomen: మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఇద్దరు యువతులు.. విద్యుత్ శాఖలో తొలిసారిగా..

First Linewomen: అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు ఈ ఇద్దరు యువతులు. విద్యుత్ శాఖలో అబ్బాయిలు

First Linewomen: మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ ఇద్దరు యువతులు.. విద్యుత్ శాఖలో తొలిసారిగా..
uppula Raju
|

Updated on: Jan 03, 2021 | 8:56 AM

Share

First Linewomen: అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు ఈ ఇద్దరు యువతులు. విద్యుత్ శాఖలో అబ్బాయిలు మాత్రమే చేసే లైన్‌మెన్ ఉద్యోగాన్ని తొలిసారిగా మేము కూడా చేస్తామని ముందుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కోర్టు నిర్ణయంతో తొలిసారిగా విద్యుత్‌ లైన్‌ఉమెన్స్‌గా ఎంపికై మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల్లో లైన్‌మన్‌ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష, వరంగల్‌ జిల్లాకు చెందిన భారతి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి ఆదిలోనే వివక్ష ఎదురైంది. లైన్‌మన్‌ ఉద్యోగాలు పురుషులకు మాత్రమేనని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకున్న వారికి అధికారులు, విద్యుత్‌ సంస్థల రూపంలో అడ్డుకట్ట పడింది. అయినా వెనుదిరగకుండా ఇద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనతో దిగి వచ్చిన అధికారులు మొదట రాత పరీక్ష నిర్వహించారు. ఏమైందో ఏమో కానీ పరీక్ష ఫలితాల విడుదలను అధికారులు నిలిపేశారు. ఈ విషయమై మళ్లీ కోర్టు మెట్లు ఎక్కడంతో రాత పరీక్ష ఫలితాలు వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. దీంతో విద్యుత్‌ సంస్థలు చేసేదేమి లేక పరీక్ష ఫలితాలు విడుదల చేయడంతో అందులోనూ శిరీష, భారతి ఉత్తీర్ణత సాధించారు. కోర్టు ఆదేశాలతో రెండోదశ పరీక్షలో భాగంగా పోల్‌ టెస్ట్‌ను నిర్వహించగా ఇద్దరూ పాస్‌ అయి చివరికి విద్యుత్‌ శాఖలో ఉద్యోగం సాధించారు.