మెదడు వాపు మరణాలు: బీహార్ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2019 | 2:27 PM

మెదడు వాపు మరణాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీహార్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వ్యాధికి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల మృతి చాలా తీవ్రమైన అంశమని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాధి వలన […]

మెదడు వాపు మరణాలు: బీహార్ సర్కార్‌కు సుప్రీం నోటీసులు
Follow us on

మెదడు వాపు మరణాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీహార్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వ్యాధికి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల మృతి చాలా తీవ్రమైన అంశమని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.

అయితే ఈ వ్యాధి వలన జూన్ 1 నుంచి ఇప్పటివరకు బీహర్‌లో 140మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. అందులో ఎక్కువ మరణాలు ముజఫర్‌పూర్‌లోనే నమోదయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తోన్న శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో దాదాపు 120మంది పిల్లలు ఈ వ్యాధి వలన కన్నుమూశారు. మరికొంతమంది తమ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.