అక్కడ.. 10 నిమిషాల్లోనే కరోనా పరీక్ష..

కరోనా మహమ్మారి కట్టడి కోసం ఎన్నో పరిశోధనలు కరుగుతున్నాయి. కాగా.. విమానాలు ఎక్కే ప్రయాణికులకు కరోనా లేదని తేల్చేందుకు కేవలం 10 నిమిషాల్లో పరీక్ష నిర్వహించే విధానాన్ని దుబాయ్ అమలులోకి తెచ్చింది.

అక్కడ.. 10 నిమిషాల్లోనే కరోనా పరీక్ష..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 1:16 PM

కరోనా మహమ్మారి కట్టడి కోసం ఎన్నో పరిశోధనలు కరుగుతున్నాయి. కాగా.. విమానాలు ఎక్కే ప్రయాణికులకు కరోనా లేదని తేల్చేందుకు కేవలం 10 నిమిషాల్లో పరీక్ష నిర్వహించే విధానాన్ని దుబాయ్ అమలులోకి తెచ్చింది. ఇటీవల కొన్ని అంతర్జాతీయ విమానాలకు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, వాటిని ఎక్కాలని భావించే విదేశీయులకు ఈ పరీక్షలు తప్పనిసరి. ‘ఆన్‌ సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19’ పేరిట పిలిచే ఈ టెస్ట్ లో ఫలితం 10 నిమిషాల్లో వచ్చేస్తుంది.

మరోవైపు.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్త్‌ అథారిటీ ఆధ్వర్యంలో మెగా పౌరవిమానయాన సంస్థ ఎమిరేట్స్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. విమానయాన పరిశ్రమలోనే తొలిసారిగా ఎమిరేట్స్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాగా, భారత ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానంలో ఫలితాల కచ్ఛితత్వాన్ని పరిశీలించిన మీదట, ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు.

Also Read: వాహనదారులకు అలెర్ట్.. సైడ్ వ్యూ మిర్రర్స్ లేకున్నా జరిమానా..