AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం.. ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేదాజ్ఞలు.. భారత్ కూడా అదే బాటలో..!

ఇతర దేశాలు కూడా యూకే నుంచి రాకపోకలపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించే ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా భారత కేంద్ర ప్రభుత్వ జాయింట్ మానిటరింగ్ కమిటీ అత్యవసర సమావేశం...

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం.. ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేదాజ్ఞలు.. భారత్ కూడా అదే బాటలో..!
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2020 | 9:42 PM

Share

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రూపం దాల్చింది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త రకం స్ట్రెయిన్‌‌పై నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని యూకే హెల్త్ సెక్రటరీ మాట్ హెన్‌కాక్ చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4ను విధించింది.

ఇతర దేశాలు కూడా యూకే నుంచి రాకపోకలపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదాజ్ఞలు విధించే ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా సోమవారం భారత కేంద్ర ప్రభుత్వ జాయింట్ మానిటరింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది.