Earthquake : అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూ ప్రకంపనలు..ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్​సీఎస్ ప్రకటన

అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూమి కంపించింది.  రిక్టర్​ స్కేల్​పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. దిగ్లిపూర్​కు ఉత్తరంగా 320 కి.మీ.ల దూరంలో భూమి..

Earthquake : అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూ ప్రకంపనలు..ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్​సీఎస్ ప్రకటన

Updated on: Dec 27, 2020 | 12:30 AM

Earthquake : అండమాన్​ నికోబార్​ దీవుల్లో భూమి కంపించింది.  రిక్టర్​ స్కేల్​పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. దిగ్లిపూర్​కు ఉత్తరంగా 320 కి.మీ.ల దూరంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్​ ఫర్​ సిస్మోలజీ(NCS​)వెల్లడించింది.అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్​సీఎస్​ పేర్కొంది.

భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం కూడా సంభవించలేదని అధికారులు తెలిపారు. సముద్రంలో కూడా అలలు ఎగిసిపడటం లేదని వెల్లడించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. భూమి పొరల్లో ఏర్పాడిన చిన్న చిన్న మార్పుల వల్ల ఇలాంటి భూ ప్రకంపనలు వస్తుంటాని తెలిపారు.