తెలంగాణ :‌‌ గుండెపోటుతో ఎక్సైజ్‌శాఖ డీఎస్పీ మృతి..

|

Jul 04, 2020 | 1:03 PM

తెలంగాణ‌ పోలీసు శాఖను ఓ వైపు కోవిడ్-19 క‌ల‌వ‌ర‌పెడుతుండ‌గా, మరోవైపు అనారోగ్య స‌మ‌స్య‌లు సిబ్బంది ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో పోలీస్ ఆఫిస‌ర్ గుండెపోటుతో శుక్రవారం క‌న్నుమూశారు.

తెలంగాణ :‌‌ గుండెపోటుతో ఎక్సైజ్‌శాఖ డీఎస్పీ మృతి..
Follow us on

తెలంగాణ‌ పోలీసు శాఖను ఓ వైపు కోవిడ్-19 క‌ల‌వ‌ర‌పెడుతుండ‌గా, మరోవైపు అనారోగ్య స‌మ‌స్య‌లు సిబ్బంది ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో పోలీస్ ఆఫిస‌ర్ గుండెపోటుతో శుక్రవారం క‌న్నుమూశారు. ఎక్సైజ్ శాఖ‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర కులకర్ణి నిన్న‌ఉదయం మృతి చెందారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం 1995 బ్యాచ్‌కు చెందిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ హార్ట్ అటాక్ తో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.