లవ్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ . 2018లో రిలీజైన ఈ సినిమా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. మొదటిసారిగా కార్తికేయ , పాయల్ రాజ్పుత్లు హీరో, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, అశోక్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘పిల్లా రా..’ అనే పాట సూపర్ డూపర్గా నిలిచింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందట. ఇందుకోసం అజయ్ భూపతి కథ కూడా సిద్ధం చేస్తున్నారని టాక్.
ఆర్ఎక్స్ 100 సినిమా రిలీజై రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా దర్శకుడు అజయ్ సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎక్స్ 100కి స్వీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను. అది కూడా కార్తికేయకు సూట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఇందులో కొత్త హీరోయిన్ను తీసుకోబోతున్నట్లు కూడా పేర్కొన్నారు.
Read More:
తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్ తెలిపితే.. డబ్బులే డబ్బులు!
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!