ఆకాశానికి.. కింద భూమికి మధ్యలో.. మేఘాల మాటున.. భోజనం చేస్తే ఎలా ఉంటుంది. ఆ థ్రిల్లింగ్నే వేరు కదా..! గాల్లోకి ఎగిరిపోయి.. అక్కడి నుంచి కిందకు చూస్తూ.. భోజనం చేస్తే.. ఆ ఊహనే సపరేట్.. కదూ. విదేశాలకు వెళ్లకుండానే.. అతి తక్కువ ఖర్చుతోనే.. మన నగరంలోనే హాయిగా భోజనం చేసేయొచ్చు. ఏంటి .. షాక్ అవుతున్నారా..! నిజమేనండీ.. ఇలాంటివి ఎక్కువగా.. విదేశాల్లోనే.. చూస్తాము.. దాదాపు అక్కడే ఉంటాయి కూడా.. కానీ.. అలాంటి సదుపాయాలను కూడా.. హైదరాబాద్ మహా నగరాల్లో ప్రవేశ పెట్టారు క్లౌడ్ డైనింగ్ నిర్వాహకులు.
ఎక్కడా అనుకుంటున్నారా..! హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామం ఎదుట.. ఈ ‘క్లౌడ్ డైనింగ్’ రెస్టారెంట్ను ఓపెన్ చేస్తున్నారు నిర్వాహాకులు. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రెస్టారెంట్ ఎండీ దేవీదత్ కోలీ తెలిపారు. హైదరాబాద్ నగరవాసులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు ఈ క్లౌడ్ డైనింగ్ను తీసుకొచ్చినట్టు వివరించారు.
ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఇక్కడ భోజనం చేయాలంటే.. ముందుగానే వైబ్సైట్ త్వారా బుకింగ్ చేసుకోవాలి. కాగా.. మామూలు రోజుల్లో ఈ ధర రూ.5,000 వరకూ ఉంటుంది. కాగా.. వీకెండ్స్లో మాత్రం ఈ క్లౌడ్ డైనింగ్ కాస్ట్ రూ.5,500లుగా ఉంటుంది.