రాజధాని వస్తుందంటే విశాఖ ప్రజలు అలా చేస్తున్నారట!

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ మారబోతోందన్న సంతోషం కంటే ఉక్కు నగర వాసులకు వేరే భయం పట్టుకుందంటున్నారు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావుపై ప్రశ్నల వర్షం సంధించిన దేవినేని ఉమ… విశాఖవాసుల్లో ఏర్పడిన కొత్త భయం ఇదేనంటూ తనదైన శైలిలో ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పువుందని పేర్కొన్న జీఎన్ రావు కమిటీ ఆ నగరం రాజధానిగా పనికి రాదన్న […]

రాజధాని వస్తుందంటే విశాఖ ప్రజలు అలా చేస్తున్నారట!
Follow us

|

Updated on: Jan 29, 2020 | 7:06 PM

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ మారబోతోందన్న సంతోషం కంటే ఉక్కు నగర వాసులకు వేరే భయం పట్టుకుందంటున్నారు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావుపై ప్రశ్నల వర్షం సంధించిన దేవినేని ఉమ… విశాఖవాసుల్లో ఏర్పడిన కొత్త భయం ఇదేనంటూ తనదైన శైలిలో ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు.

విశాఖ నగరానికి తుఫానుల ముప్పువుందని పేర్కొన్న జీఎన్ రావు కమిటీ ఆ నగరం రాజధానిగా పనికి రాదన్న నివేదిక ఇచ్చిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపాయి. దానిపై జీఎన్ రావు స్వయంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసీ మరీ క్లారిఫికేషన్ ఇచ్చారు.

అయితే, జీఎన్ రావు ఇచ్చిన వివరణపై తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి దేవినేని ఉమ.. జీఎన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జీఎన్ రావుకు వంద మీటర్లు నడిస్తే…రెండు రోజులు విశ్రాంతి అవసరం.. అలాంటి జీఎన్ రావు రాష్ట్రం అంతా ఎలా తిరిగారు’’ అని నిలదీశారు దేవినేని ఉమ. జీఎన్ రావు కమిటీ రిపోర్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో ఉమ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని దస్‌పల్లా, వాల్తేరు క్లబ్ భూములను కొట్టేయడానికి విజయసాయి ప్లాన్ చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. విశాఖనగరంలో సామాన్యులు భయడుతున్నారని, తమ భూములు కబ్జాకు గురి కాకుండా ఖాళీ స్థలాలకు కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నగరవాసులకు ఇప్పుడు కబ్జాల భయం పట్టుకుందంటున్నారు ఉమ.

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది