AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో ఒక్కరోజే 61 మంది కరోనాతో మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. అంతకంతకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,864కు చేరింది. ఇక, గురవారం కొత్త‌గా 2,373 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఢిల్లీలో ఒక్కరోజే 61 మంది కరోనాతో మృతి
Balaraju Goud
|

Updated on: Jul 02, 2020 | 9:22 PM

Share

దేశంలో కరోనా ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఎప్పడు ఏ రూపంలో అంటుతోందన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. అంతకంతకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్క‌రోజే క‌రోనాతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,864కు చేరింది. ఇక, గురవారం కొత్త‌గా 2,373 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఇవాళ క‌రోనా నుంచి కోలుకున్న 3,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం క‌రోనా పాజిటివ్ తో 92,175 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 20,822 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 10,978 ఆర్టీపీసీఆర్ టెస్టులు కాగా, 9,844 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు.