టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌

|

Nov 02, 2020 | 7:25 PM

టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రహానె, అక్షర్‌ పటేల్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్‌ పేర్కొన్నాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ మార్పులు జరిగినట్లు

టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌
Follow us on

Delhi Capitals Win The Toss :  ఐపీఎల్ -13 సీజన్ మెగా క్రికెట్‌ లీగ్‌ కీలక దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నువ్వా… నేనా అని తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆసక్తికర పోరులో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.

టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రహానె, అక్షర్‌ పటేల్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్‌ పేర్కొన్నాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ మార్పులు జరిగినట్లు విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. గుర్‌కీరత్‌ మన్‌, నవదీప్‌ సైనీ స్థానంలో శివమ్‌ దూబే, శాబాజ్‌ అహ్మద్‌ తుది జట్టులోకి వచ్చారు.