సాయిబాబా భక్తులకు శుభవార్త.. ముగిసిన షిర్డీ బంద్‌!

సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీలో జరుగుతోన్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బంద్‌ను నిలిపివేస్తున్నట్లు షిర్డీవాసులు ప్రకటించారు. ఇవాళ సీఎం నిర్వహించనున్న సమావేశం తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అంతకముందు ఆదివారం షిర్డీతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలు బంద్‌ పాటించారు. ఇక బంద్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు అన్నీ కూడా మూసి ఉన్నాయి. అయితే ఆలయ దర్శనాలు, పూజలు మాత్రం […]

సాయిబాబా భక్తులకు శుభవార్త.. ముగిసిన షిర్డీ బంద్‌!
Follow us

|

Updated on: Jan 20, 2020 | 11:23 AM

సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీలో జరుగుతోన్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బంద్‌ను నిలిపివేస్తున్నట్లు షిర్డీవాసులు ప్రకటించారు. ఇవాళ సీఎం నిర్వహించనున్న సమావేశం తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

అంతకముందు ఆదివారం షిర్డీతో పాటుగా చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలు బంద్‌ పాటించారు. ఇక బంద్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు అన్నీ కూడా మూసి ఉన్నాయి. అయితే ఆలయ దర్శనాలు, పూజలు మాత్రం యధావిధిగా కొనసాగాయి. అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలన్నింటిని కూడా స్థానికులు కల్పించారు. గ్రామస్తులు, భక్తులు ద్వారకామాయి ఆలయం నుంచి సాయి ఆలయం వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఇక బంద్ నేపథ్యంలో ఆదివారం నాడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్ మందిర్’ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే పాథ్రీని అభివృద్ధి చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యుడు సచిన్ థాంబ్ తెలిపారు. బాబా ఎన్నడూ కూడా తన జన్మస్థలం పాథ్రీనేనని చెప్పలేదు.. అలాంటప్పుడు బాబా జన్మించింది పాథ్రీ అని ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా, ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే షిర్డీ, పాథ్రీకి చెందిన స్థానికులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే, సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగ్లీకర్‌‌లతో ఈ విషయంపై చర్చించనున్నారు.