బ్రెజిల్‌లో కొనసాగుతు కరోనా మరణమృదంగం..!

|

Aug 07, 2020 | 5:15 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 29,12,212 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యినట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా 98,493 మంది కరోనా బారినపడి ప్రాణాలొదిలారు.

బ్రెజిల్‌లో కొనసాగుతు కరోనా మరణమృదంగం..!
Follow us on

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 29,12,212 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యినట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా 98,493 మంది కరోనా బారినపడి ప్రాణాలొదిలారు. ఇక, గురువారం ఒక్కరోజే ఆ దేశంలో కొత్త 57,152 మందికి కొవిడ్ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కరోనాను జయించలేక గురువారం ఒక్కరోజే 1,437 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందారు. అమెరికాలో ఇప్పటివరకు 4.8 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 3మిలియన్ల కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18.9 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు 7 లక్షల 12 వేల మంది కరోనాతో మృత్యువాతపడ్డారని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.