మాజీ డీజీపీకి కోర్టు వారెంట్!

మాజీ డీజీపీ పేర్వారం రాములు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు వారెంట్ జారీ అయింది. 2001లో ఓ భూకబ్జా కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని సీపీ హోదాలో ఉన్న పేర్వారం రాములు అరెస్ట్ చేయించారు. దానిపై మాధవరెడ్డి పరువునష్టం దావా వేయగా, 2017లో మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని కోర్టు పేర్వారం రాములును ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. […]

మాజీ డీజీపీకి కోర్టు వారెంట్!

Edited By:

Updated on: Jun 25, 2019 | 9:44 PM

మాజీ డీజీపీ పేర్వారం రాములు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు వారెంట్ జారీ అయింది. 2001లో ఓ భూకబ్జా కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని సీపీ హోదాలో ఉన్న పేర్వారం రాములు అరెస్ట్ చేయించారు. దానిపై మాధవరెడ్డి పరువునష్టం దావా వేయగా, 2017లో మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని కోర్టు పేర్వారం రాములును ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పేర్వారం రాములుపై వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది.