మాజీ డీజీపీకి కోర్టు వారెంట్!

మాజీ డీజీపీ పేర్వారం రాములు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు వారెంట్ జారీ అయింది. 2001లో ఓ భూకబ్జా కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని సీపీ హోదాలో ఉన్న పేర్వారం రాములు అరెస్ట్ చేయించారు. దానిపై మాధవరెడ్డి పరువునష్టం దావా వేయగా, 2017లో మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని కోర్టు పేర్వారం రాములును ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. […]

మాజీ డీజీపీకి కోర్టు వారెంట్!

Updated on: Jun 25, 2019 | 9:44 PM

మాజీ డీజీపీ పేర్వారం రాములు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు వారెంట్ జారీ అయింది. 2001లో ఓ భూకబ్జా కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డిని సీపీ హోదాలో ఉన్న పేర్వారం రాములు అరెస్ట్ చేయించారు. దానిపై మాధవరెడ్డి పరువునష్టం దావా వేయగా, 2017లో మాధవరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని కోర్టు పేర్వారం రాములును ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పేర్వారం రాములుపై వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us